భారతీయ సనాతన ధర్మాన్ని భావితరాలకు అందించేందుకు రామ కోటి మాదిరిగానే గోవింద కోటి రాయాలని తి.తి.దే వారు పిలుపునిచ్చారు. గోవింద కోటి రాసిన భక్తులకు వీఐపీ దర్శనం కల్పిస్తామని తి.తి.దే వారు ప్రకటించారు. భక్తులు స్వామి వారికి మరింత దగ్గరవ్వడానికి గోవింద కోటి రాయడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నప్పటి నుంచి గోవింద కోటి వ్రాయడం నేర్పించి భారతీయ సనాతన ధర్మాన్ని భావితరాలకు అందించాలి. భక్తులు గోవింద కోటి రాయడానికి అనువుగా ఒక్కొక్క పుస్తకానికి లక్ష నామాలు రాసే విధంగా లక్ష (పెద్దపెద్ద) గడులను ఇవ్వడం జరిగింది. స్వామి వారిని మదిలో స్మరిస్తూ వంద పుస్తకాలలో గోవింద కోటి రాయడం ప... See more
భారతీయ సనాతన ధర్మాన్ని భావితరాలకు అందించేందుకు రామ కోటి మాదిరిగానే గోవింద కోటి రాయాలని తి.తి.దే వారు పిలుపునిచ్చారు. గోవింద కోటి రాసిన భక్తులకు వీఐపీ దర్శనం కల్పిస్తామని తి.తి.దే వారు ప్రకటించారు. భక్తులు స్వామి వారికి మరింత దగ్గరవ్వడానికి గోవింద కోటి రాయడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నప్పటి నుంచి గోవింద కోటి వ్రాయడం నేర్పించి భారతీయ సనాతన ధర్మాన్ని భావితరాలకు అందించాలి. భక్తులు గోవింద కోటి రాయడానికి అనువుగా ఒక్కొక్క పుస్తకానికి లక్ష నామాలు రాసే విధంగా లక్ష (పెద్దపెద్ద) గడులను ఇవ్వడం జరిగింది. స్వామి వారిని మదిలో స్మరిస్తూ వంద పుస్తకాలలో గోవింద కోటి రాయడం పూర్తి చేస్తే భక్తుల సంకల్పం సిద్ధించి శ్రీవారి కృపకు పాత్రులు కాగలరు. మృత్యు, శత్రు, రోగ బాధల నుంచి విముక్తి కలిగి సుఖశాంతులు, అష్టైశ్వర్యములు పొందగలరు.